కృష్ణా జలాలపై ఏపీ హక్కులు కాపాడండి: చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృష్ణా నది జలాల వివాదంపై 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ -2 (KWDT-II) ముందు జరగబోయే విచారణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నీటి హక్కులను పూర్తి నిబద్ధతతో కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 63 టీఎంసీ డిపెండబుల్ నీటిని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందని, ఈ డిమాండ్‌ను ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా 512 టీఎంసీ కేటాయించబడిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఒక్క టీఎంసీ తగ్గినా దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే కర్ణాటకకు అనుమతి దక్కిందని జగన్ ఆరోపించారు.

తెలంగాణ తమ వాటా (811 టీఎంసీలో 70 శాతం)ను ఎక్కువగా కోరుకుంటోందని, 2014లో జరిగిన 299:512 టీఎంసీ కేటాయింపు తాత్కాలికమేనని తెలంగాణ వాదిస్తోందని జగన్ తెలిపారు. అంతేకాక, ఏపీ తన వాటాను బేసిన్ బయట పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులకు మళ్లిస్తోందని తెలంగాణ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఏపీ హక్కులను కాపాడేందుకు సంకీర్ణ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పోరాడాలని, పునఃకేటాయింపును అడ్డుకోవాలని జగన్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *