భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనే ఆరోపణలకు పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బలం చేకూర్చాయి. తమ దేశం భారత్పై టెర్రర్ గ్రూపులతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఒక ఉన్నత స్థాయి నాయకుడే స్వయంగా ఉగ్రవాద దాడులను సమర్థిస్తూ, వాటికి ప్రోత్సహం ఇస్తామని చెప్పడం పాకిస్తాన్ వైఖరిని మరోసారి ప్రపంచానికి రుజువు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
చౌదరి అన్వరుల్ హక్ తన ప్రకటనలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఇప్పటికే తాము ఈ పని చేశామని, ఆ దాడుల్లో మరణించిన వారి శరీరాలను లెక్కించలేక పోతున్నారని” భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన విషం కక్కారు. ఈ వ్యాఖ్యల ద్వారా గతంలో జరిగిన తీవ్రవాద దాడులను తామే ప్రోత్సహించామని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. ముఖ్యంగా, ఆయన తన ప్రసంగంలో ఎర్రకోట ఆత్మాహుతి దాడి మరియు పహల్గామ్ అటాక్ వంటి దాడులనే పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని తమ రాజకీయ సాధనంగా ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ ఎంతగా తెగించిందో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
అంతేకాకుండా, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎదురయ్యే పరిణామాల గురించి హెచ్చరిస్తూ, బలూచిస్థాన్ విషయంలో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు, సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ నాయకత్వం ఇస్తున్న మద్దతును, దాని దురుద్దేశాన్ని మరోసారి నిరూపించాయి. భారతదేశం తన భద్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి, తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది.