ఆగస్ట్ 15 నుంచి AP పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు

ఆగస్ట్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఇవాళ విద్యారంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులు యాథావిధిగా కొనసాగించాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *