తమిళనాడు : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . ఈ సమయంలో ప్రజలలో భిన్న వైఖరి లు వెలుబడుతున్నాయి . కొందరు వైద్యులపై దాడులకు పాల్పడుతున్న రోగులు . చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా సోకిన ఓ వ్యక్తి ఉమ్మి వేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్ శనివారం రోజున చేరాడు. అయితే అతడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు సహకరించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన మాస్క్ను తీసివేసి దానిని డాక్టర్పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.