కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్.. సుదీర్ఘంగా సాగిన సమావేశం..

తెలంగాణ కేబినెట్ శనివారం భేటీ అయింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీల అమలు తీరు, మేనిఫెస్టోలోని ఇతర అంశాల మీద కేబినెట్ సమావేశం చర్చించింది. దీనితో బాటు ఇప్పటి వరకు పలు అంశాల మీద ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అనంతరం పలు కీలక అంశాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

 

మంత్రివర్గం ఆమోదించిన అంశాలు..

ములుగులో సమ్మక్క-సారలమ్మ సెంట్రల్ వర్సిటికి ఎకరం రూ. 250కే భూముల కేటాయింపు

కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు అంగీకారం

హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్

ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ఆమోదం

సన్న బియ్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చేందుకు నిర్ణయం

రేరాలో 54 ఉద్యోగాలు భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమి బదలాయింపు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణ సేక

రణకు ఆమోదం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *