రాజకీయ కుట్రతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయుటకు పాచికలు విసిరిన దుండగులను కఠినంగా శిక్షించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా భారీ ఎత్తున నిర్వహించిన నిరసన ర్యాలీ లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కొంతమంది రాజకీయ పార్టీ దుండగులు అనాది కాలం నుండి ప్రభుత్వ రికార్డులలో లేని ప్రభుత్వ భూములను కనుమరుగు చేసి ధరణిలో చేర్చారని మరియు ప్రజాస్వామ్య వ్యవస్థని బ్రష్టు పట్టించారని తెలియజేశారు. ఇట్టి విషయంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధరణిలో చేర్చిన భూములను, కనుమరుగైపోయిన ప్రభుత్వ భూములను కాపాడడం కోసం ప్రక్షాళన కొనసాగిస్తుంటే అందుకు అండగా నిలిచిన మద్దతుగా నిలిచిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రఅధ్యక్షులు మహేష్ గౌడ్ గారు,మైనంపల్లి హనుమంతరావు గారు, మధు యాష్ కి గౌడ్ గారు, ఫెరోస్కాన్ గారు, మరియు ప్రభుత్వ భూములను కాపాడే ప్రక్షాళనలో హైడ్రాకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిజెపి పార్టీ నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నిపుణులు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో, అభివృద్ధి కోరడంలో సంఘటితమైతుంటే కొంతమంది రాజకీయ పార్టీ దుండగులు, భూ బకాసురులు వాళ్ల యొక్క అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వభూములు ఎక్కడ బయట పడతాయి అన్న విషయంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మరియు అందుకు మద్దతు తెలుపుతున్న వారిపై బురద చల్లడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్ర నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఇట్టి చర్యకు పాల్పడుతున్నటువంటి, రాజకీయ కుట్రతో పాచికలు విసిరిన రాజకీయ పార్టీలను, నాయకులను త్వరలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు బొంద పెట్టడం ఖాయమని తెలియజేశారు. ఇట్టి విషయాన్ని భారత ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించే విధంగా చూస్తామని తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలైన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు శాంతియుతంగా ఉండాలని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న నిజమైన దోషులను, దుండగులను శిక్షించే వరకు ఎరుకలో ఉంటూ హిందూ దేవాలయ లను ధ్వంసం చేస్తున్న దుండగుల ఆచూకిని పగడ్బందీగా తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారికి తెలియజేయాలని, పోలీస్ శాఖ వారికి సహకరించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ యొక్క నిరసన ర్యాలీలో తాంగడ పల్లి అప్పగారు శివ యోగి, విశ్వ హిందూ పరిషత్ పట్టణ శాఖ తరపున పవన్ గౌడ్, మునిపల్లి సత్యనారాయణ , కంది కృష్ణ, అడ్వకేట్ వై నాగరాజుగౌడ్, వోదెల మాణిక్ రావు, అడ్వకేట్ వైభగవంతరావు, కోవూరి శంకర్ గౌడ్, రాఘవరెడ్డి, చింత సాయి, కోవూరి సంఘమేశ్వర్, చిన్న పటేల్, పిల్లోడి విశ్వనాథం, మహేష్ స్వామి, రాచన్న, రవీందర్ సార్ , చిదానందం , విజయ్ యాదవ్, చీల మల్లన్న, తాలెల్మ రాము, రాగం అనిల్, అఖిల్, సోమ శంకర్, నల్ల సాయికిరణ్, హరి, గాజుల కృష్ణ, ఆదోని చంద్ర శేఖర్, వెంకటాపురం జీవన్, బొమ్మిడ్యాల శ్రీకాంత్, వేణు గోపాల్, నరేష్, శ్రీహరి, టి. ఈశ్వర్, అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మరియు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *