రామ్చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్..?

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం శంకర్ ‘గేమ్ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేయనున్నారు. దీని తర్వాత సుకుమార్తో ఓ సినిమా ఓకే చేశారు. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టిన రామ్చరణ్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో జత కట్టనున్నారని ఇన్సైట్ టాక్ వినిపిస్తోంది.

రామ్చరణ్- ప్రశాంత్ నీల్ కాంబో దాదాపు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు కూడా పూర్తయ్యాయట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూపొందించనున్నారని సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ చేతిలో వరుసగా ‘ఎన్టీఆర్ 31’, ‘సలార్ 2’, ‘కేజీఎఫ్ 3’ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తైన తర్వాత రామ్చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిసింది. అంతలోపు బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉండనున్నారు రామ్చరణ్. కాగా, ఈ వార్త మెగా ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపుతోంది

రామ్చరణ్ ‘గేమ్ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా 2024 డిసెంబర్లో రానున్నట్లు మేకర్స్ కొద్ది రోజులుగా చెబుతున్నా, డేట్ వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ రెండు తేదీలు ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 20న లేదా క్రిస్మస్‌ సందర్భంగా 25న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు శ్రీకాంత్, అంజలీ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *