పవన్ కల్యాణ్‌కు షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

దేశంలో రాజకీయాల ట్రెండ్ మారింది. ప్రత్యర్థులపై ఎంత గట్టిగా విరుచుకుపడితే అంతగా పాపులర్ అవుతున్నారు ఆయా నేతలు. పాపులారిటీతోపాటు కేసులు చుట్టుముడు తున్నాయి. ఆ తర్వాత కేసుల సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ కోవలోకి వచ్చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

 

సనాతన ధర్మం పేరిట గురువారం తిరుపతిలో సభ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అసలు సనాతన ధర్మం గురించి చెబుతూ.. ప్రత్యర్థులకు చురకలు అంటించారు. ఈ క్రమంలో కొందర్ని టార్గెట్ చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఇందులోని లాగేశారాయన. గతంలో ఆయన సనాతన ధర్మంపై చేసిన కామెంట్ ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

 

ఈ వ్యవహారం తమిళ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వైఖరిని చాలామంది తప్పుబట్టారు కూడా. మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది. దీంతో మదురై పోలీసులు ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *