ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు..

టాలీవుడ్ లో ఇంకా జానీ మాస్టర్ కేసు ఒక కొలిక్కి రాకముందే మరో యువతీ.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సెన్సేషనల్ గా మారింది. సోషల్ మీడియా వాడేవారికి హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నా అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను ఉన్న మోస్ట్ పాపులర్ యూట్యూబర్. తాజాగా హర్ష సాయిపై నార్సింగి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఒక యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

పెళ్లి పేరుతో తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరిగుతున్నాడని ఆమె తెలిపింది. ఇక ఈ విషయంలో హర్ష తండ్రి రాధ కృష్ణ కూడా సపోర్ట్ గా ఉన్నాడని తెలుపుతూ అడ్వకేట్ తో కలిసి నార్సింగి పీఎస్ కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది . ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ కేసును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *