ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 4 నెలల కాలవ్యవధిలోనే 4,500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అందులో 80 శాతానికి పైగా ఎయిర్టెల్ కస్టమర్లే ఫోన్లు ఉన్నట్టు తెలిసింది. ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్కు సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. కాంగ్రెస్కు చెందిన కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి కాంగ్రెస్కు చెందిన 90 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు బయటపడింది. ట్యాపింగ్కు పాల్పడిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. టోటల్గా 340 జీబీల సమాచారాన్ని ఆయన ధ్వంసం చేసినట్టు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి జాబితాలో బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పేరు కూడా ఉన్నది. ఈటెల రాజేందర్ ఫోన్తోపాటు ఆయన గన్మెన్, పీఆర్వో, సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయి.