మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు..!

తెలంగాణలో గణేష్ నిమజ్జనం చివరకు దశకు వచ్చింది. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

రేవంత్‌రెడ్డి సర్కార్ మనస పుత్రిక మూసీ అభివృద్ధి ప్రాజెక్టు. దీన్ని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమైంది. దీనికి సంబందించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోయతున్నాయి. గడిచిన కొన్నేళ్లగా మూసీ కెనాల్‌కు ఇరువైపులా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. కాలువను కుదించిమరీ అక్రమ కట్టడాలు కట్టేశారు కబ్జాదారులు. పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. గడిచిన వారంరోజులుగా రెవిన్యూ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *