2030 నాటికి పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని ఐదేళ్లు ముందుకు జరిపినట్లు తెలిపారు ప్రధాని మోదీ. ఇథనాల్ రంగ అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణ సహా రైతులకు ఆర్థికంగా మేలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం కలిసి పయనించగలవని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ ఎంచుకున్న మార్గం అదేనని తెలిపారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పెట్రోలియం, రవాణా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్తో ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇథనాల్ రంగ అభివృద్ధికి రోడ్మ్యాప్ విడుదల చేయడం ద్వారా భారత్ కీలక ముందడుగు వేసిందని మోదీ అన్నారు.