పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్….

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నది. వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నది. అయితే, తాజాగా కూడా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ పాలనప్పటి నుంచి కొనసాగుతున్న కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్న నికోబార్ రాజధాని పోర్ల్ బ్లెయిర్ పేరును మార్చివేసింది. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

 

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఈ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

 

ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చడం.. నిజంగా ఇది ప్రశంసనీయమైన చర్య. గత వలస వారసత్వ బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనున్నది. ప్రధాన%E