రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏర్పాటు చేయనున్న ఆ పాఠశాలలకు యంగ్ ఇండియా పేరు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా వర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిని స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ ను మార్చాలని ఆయన చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.