సంగారెడ్డి జిల్లా, సదాశిపేట పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకాండకు, అత్యాచారాలకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మానవత్వాన్ని మర్చిపోయి మూర్ఖత్వంగా వ్యవహరించమని ఏ మత గ్రంథాలు చెప్పలేదని తెలియజేస్తూ
ఈరోజు బంగ్లాదేశ్లో మానవత్వ విలువలు మరిచిపోయి అజ్ఞానంతో మూర్ఖత్వంగా వ్యవహరించి హిందువులపై హింసాత్మక చర్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరపడం సరైనది కాదని అందుకు నిరాసనగ సదాశివపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఇలాంటి హింసాత్మక చర్యలు చేపట్టే వారిని కఠినంగా శిక్షించాలని వెంటనే ఇలాంటి చర్యలు చేపట్టే వారి పైన ఐక్యరాజ్యసమితి స్పందించి కఠినమైన చర్యలు తీసుకొని సరైన శిక్ష విధించి బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ ప్రజలను కాపాడాలని కోరుతూ బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రముఖ వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ఉద్యమకారులు, సంఘసంస్కర్తలు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, అందరూ కలిసి సదాశివపేట ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.