రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని RJ శేఖర్ బాషా, ప్రీతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్యతో తమకు మూడేళ్లుగా పరిచయం ఉందని, డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ కాల్స్ చేస్తూ ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కాగా, ప్రీతి ఆరోపణలను లావణ్య ఖండించారు. ఆమెకే డ్రగ్స్, గంజాయి అలవాటు ఉందని చెప్పారు.