రౌడీలకు, గుండాలకు టీఆర్ఎస్ టిక్కెట్లు: బండి సంజయ్

వరంగల్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలకు, గుండాలకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్బంగా నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల, కాళ్ళు, చేతులు నరికేటోళ్లకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. ”తలలు నరికే పార్టీ కావాల్నా.. ఓరుగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలా ప్రజలు ఓటేసేప్పుడు ఆలోచించుకోవాలి” అని అన్నారు. రాంపుర్ డంప్ యార్డ్ నుండి చెత్త చెదారం వచ్చి వడ్డేపల్లి చెరువులో చేరుతున్నాయని తెలిపారు. ఆ నీటిని తాగునీటికి సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అవకాశం ఇస్తే మంచినీటిని సరఫరా అయ్యేలా చూస్తామని అన్నారు. ఆక్సీజన్ ప్లాంట్ కోసం కోట్లు కేటాయిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జీరో అకౌంట్‌లో పైసలు ఇస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మాత్రం అక్రమంగా దోచుకున్న డబ్బును విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 2023లో అధికారంలోకి తామే వస్తామని.. కేటీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *