గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఉత్తమ్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. కరోనా భయంకర పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఉత్తమ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్‌లో మరిన్ని వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతానని ఉత్తమ్‌కు గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.

గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఉత్తమ్

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉందని, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు కరోనా బారినపడతారంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ నిర్ణయానికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తలొగ్గుతోందని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. ఇంతటి భయానక పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఎన్నికలు వాయిదా వేసి, ప్రజలను రక్షించాలని ఉత్తమ్ ఆ లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *