అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమీక్షిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కొరత నుంచి బయటపడటానికి కార్యాచరణ చేపట్టారు. అంతేగాక సమావేశంలో ఉంగానే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారథికి సీఎం ఫోన్ చేశారు. ఇరువురితో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్… రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోస్లతో పాటు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం మంత్రుల కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ వివరాలను సీఎం జగన్కు మంత్రులు అందిస్తున్నారు. ఆక్సిజన్ సప్లై, రెమిడిసివేర్, బెడ్స్ అందుబాటు తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజువారీగా వేలల్లోనే నమోదవుతున్నాయి. నిన్న ఏపీలో 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నిన్న మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆ వివరాలను సీఎం జగన్కు మంత్రులు అందించనున్నారు. ఆక్సిజన్ సప్లై, రేమిడిసివేర్, బెడ్స్ అందుబాటు తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజువారీగా వేలల్లోనే నమోదవుతున్నాయి. నిన్న ఏపీలో 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.