రాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మితమైంది. ఇక ఇప్పుడు సీతాదేవి జన్మస్థలంగా భావించే బిహార్ రాష్ట్రంలోని సీతామడీ జిల్లాలో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. ఇప్పుడున్న సీతమ్మ ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించనుంది. వందేళ్ల క్రితం నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో కొత్త ఆలయ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు.