వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ సమక్షంలో పార్టీలోకి కాపు ఉద్యమ నేత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.

 

ఎపీలో గతకొంతకాలంగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే చర్చ తీవ్రంగా నడిచింది. తాజాగా ముద్రగడ ఈ చర్చలకు ముగింపు పలికారు. చివరకు వైసీపీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ప్రాచుర్యం పొందిన ముద్రగడ ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *