నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న 4డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఉద్యోగుల మెడికల్ బిల్స్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.