దేశంలో పాము కాటుల వల్ల ప్రతీ ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాముకాటు చికిత్సకు ప్రస్తుతం ‘యాంటీ స్నేక్ వీనమ్’ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మానవ యాంటీబాడీని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. ఇది సాంప్రదాయ స్నేక్ వీనమ్ని ఎదుర్కొనే మందులతో పోలిస్తే అత్యంత సమర్థవంతమైందిగా చెప్పారు.