నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ….

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉవముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

 

తెలంగాణ లోని 15 స్టేట్ హైవేస్‌ను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని సిక్స్ లేన్‌గా విస్తరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగం డెవలప్‌మెంట్, హైదరాబాద్ కల్వకుర్తి ఫోర్ లేన్, హైదరాబాద్- శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడర్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగానికి కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

వీటితో పాటు సిర్పూర్- కాగజ్‌నగర్ జాతీయ రహదారి, భువనగిరి రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వేరే చోటకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, వాటి పెంపు గురించి చర్చించారు.

 

ఇక నల్గొండలో ట్రాన్‌స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *