జగన్ ఆస్తుల్ని జనాలకి పంచుతా: నారా లోకేష్..

టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులను జనాలకు పంచిపెడుతామని విశాఖలోని శంఖారావం సభలో నారా లోకేష్ వెల్లడించారు. మద్యం, ఇసుక, గ్రావెల్, భూముల కుంభకోణాలతో జగన్ రూ.లక్షల కోట్లను లూటీ చేశారని మండిపడ్డారు. ‘తనకు టీవీ, పత్రిక, ప్యాలెస్‌లు లేవని జగన్ చెబుతున్నారు. నిజమే ఎందుకంటే అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి. వారికే చెందుతాయి’ అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *