నేడు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..

రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారించనున్నారు. ఉదయం ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *