నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్‌ఎస్‌ అధినేత, శాసనసభ పక్షనేత కేసీఆర్ ఇవాళ తెలంగాణభవన్‌కు రానున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *