సదాశివపేట పట్టణంలో ఘణంగా బాబుజగజీవన్ రాం 119 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న- కాంగ్రెస్ పార్టీ పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ.

తేది:05-04-2026, సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈ రోజు బాబు జీవన్ రాం 119 జయంతి వేడుకల్లో పాల్గొన్న సదాశివపేట పట్టణ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ బస్టాండ్ వద్ద గల బాబు జగ్జీవన్ రాం కు పూలమాలలు వేసి అయిన దేశానికి చేసిన సేవలు గుర్తు చేసారు అయన మన దేశ మొదటి ఉప ప్రధాన
మంత్రిగా దేశసేవ చేసారు అని 1952 నుండి 1986వరకు సుమారు 40 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంట్ సభ్యునిగా కొనసాగరని మరియు కర్మీక
మంత్రిగా( 1967-70 ) హరిత విప్లవాన్ని విజయవంతం చేసి
దేశాన్ని ఆహార సంక్షోభం నుండి కాపాడారని అంతే కాకుండా మంత్రిగా అయన పలు పదవులు చేపట్టరాని అన్నారు, బాబు జగ్జీవన్ జయంతి ముందుండి విజయవంతం చేసిన బాబు జగ్జీవన్ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ రేణుక చిరంజీవి గారు, కౌన్సిలర్లు, కార్యాలయ ఉద్యోగులు,బి. జె. పి మాజీ కౌన్సిలర్ ఓదెల మాణిక్ రావు, MRF ప్రెసిడెంట్ &కౌన్సిలర్ కొత్త గొల్ల శేఖర్, బి, జె,పి కౌన్సిలర్ ఉల్లీగడ్ల ఉమారాణి నాగనాథ్ మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *