తేది:29-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున స్థానిక పద్మశాలి సేవా సంఘ భవనంలో నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వేముల సతీష్, ఉపాధ్యక్షులుగా అనుమల్ల మల్లేశం, సిరిపురపు ఆనందం, ప్రధాన కార్యదర్శిగా మోర శివకుమార్, కోశాధికారిగా పొట్టవత్తిని నాగభూషణం, సంయుక్త కార్యదర్శులుగా బొమ్మ కంటి సురేష్, బొమ్మకంటి రఘు, ప్రచార కార్యదర్శిగా మిట్టపల్లి జగన్ ముఖ్య సలహాదారులుగా మోర గణేశం, వెంకటేశ్వర్లు, నామని లక్ష్మీనరసయ్య, బొమ్మకంటి ధర్మపురి, మిట్టపల్లి దామోదర్ కార్యవర్గ సభ్యులుగా మిట్టపల్లి రాకేష్, బొమ్మకంటి రవికుమార్, అనుమల్ల సతీష్, నామని గణేష్, గుట్ట శ్రీనివాస్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పోతు సత్యనారాయణ, మిట్టపల్లి రాజేందర్, చిలివేరి గంగారం, బొమ్మకంటి రాజు, ఉమేష్, రాజమౌళి, గణేష్ దాసరి రమేష్, దీకొండ సుధాకర్, స్వర్గం సత్యనారాయణ, మిట్టపల్లి గంగాధర్, మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.