బాచుపల్లి ఫ్లైఓవర్ పనులపై కొలన్ హన్మంత్ రెడ్డి సమీక్ష – వేగవంతం చేయాలని ఆదేశం.

తేది:27-03-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా, ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కీలకమని ఆయన పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతులు ఎంతో అవసరమని తెలిపారు.
అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనుల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *