తేది:21-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. నెల రోజుల పాటు క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలను విరమించి, ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో సర్పంచులు గ్రామాల ప్రథమ పౌరులు పాల్గొని పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా, ముస్లిం సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
మాజీ ఎంపిటిసిలు & వార్డు సభ్యులు: ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని చాటారు.
హిందూ-ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణం ముస్లిం సోదరులు ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకుని ఈద్గాలకు చేరుకున్నారు. ఇమామ్లు చదివిన ఖురాన్ పఠనాన్ని వింటూ లోక కల్యాణం కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని అల్లాను వేడుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకోవడం పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.