మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు నిరాకరించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్ బిల్లు-2023ని అత్యవసరంగా అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇది పార్లమెంటులో చట్టం కింద పొందుపర్చబడిందని, జనాభా గణన తర్వాత అమలవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదించారు.