హైదరాబాద్ టు థాయ్‌లాండ్ విమానానికి తప్పిన ప్రమాదం: పుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో హార్డ్ ల్యాండింగ్!

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు 133 మంది ప్రయాణికులతో వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో విమానం రన్‌వేను బలంగా ఢీకొట్టడంతో (Hard Landing) ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ఘటనలో బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం యొక్క ముందుభాగం చక్రం (Nose Landing Gear) తీవ్రంగా దెబ్బతిన్నది. హార్డ్ ల్యాండింగ్ కారణంగా విమానం రన్‌వేపై కొంత దూరం జారిపోయి ఆగిపోయింది. దీనిని గమనించిన విమానాశ్రయ అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా కిందికి దించి విమానాశ్రయ టెర్మినల్‌కు తరలించారు.

ఈ ప్రమాదం కారణంగా పుకెట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు రన్‌వేను తాత్కాలికంగా మూసివేస్తూ ‘నోటమ్’ (NOTAM) జారీ చేశారు. దీనివల్ల అక్కడికి రావాల్సిన ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానం ముందు చక్రం దెబ్బతినడానికి గల కారణాలపై సాంకేతిక నిపుణులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యాహ్నం 11:40 గంటల సమయంలో థాయ్‌లాండ్‌లో ఈ ప్రమాదానికి గురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *