ఇటీవల హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన రేప్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని వివాదాస్పద వాఖ్యలు చేశారు. అయితే చిరంజీవి, ఖుష్బూలు ఈ వ్యాఖ్యలను తప్పు పట్టారు. దీంతో చిరంజీవి, త్రిష, ఖుష్బూలు తన పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టులో వీరిపై మన్సూర్ పరువునష్టం దావా వేశారు