

తేది:03-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో 8వ వార్డు ప్రజలు ఎంతో ఆనందానికి గురియై సంతోషంతో సమాజానికి నిస్వార్థ సేవలు అందించిన సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారు సదాశివపేట పట్టణంలో 8వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం మా ఎనిమిదో వార్డు ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎనిమిదవ వార్డు ప్రజలు గత పది ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) ప్రభుత్వం మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం, మా ప్రాంత సమస్యలను తీర్చడంలో చిన్న చూపు చేయడం ఇంకా మేము మర్చిపోలేని సంఘటనలు, అని 8వ వార్డు ప్రజలు తెలియజేస్తూ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో బి ఆర్ఎస్(టిఆర్ఎస్ ) పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తెలియజేశారు. అదేవిధంగా ఎనిమిదవ వార్డులో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఖరారు చేశారు. అందుకు సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారు ప్రజల ఆశీర్వాదమే గెలుపుకు కారణము అవుతుందని అందుకు వార్డు లో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకోవడానికి ప్రచారంలో వస్తున్నానని, గెలిచిన వెంటనే 8వ వార్డు అభివృద్ధి, మరియు ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు.