హవేలీ ఘనపూర్ మండలంలోని కూచన్ పల్లీ గ్రామంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

తేది:01-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండల రిపోర్టర్ తలారి బాలయ్య.

మెదక్ జిల్లా : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.
కేసీఆర్ గారిని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యం.
పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ గారిపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ గారి జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి శేఖర్ రెడ్డి, బయన్న, శివకుమార్, శ్రీనివాస్, భాస్కర్, రమేష్, కృష్ణ, రామకృష్ణ, బాలు, చాంద్ పాషా, యాదగిరి, పవన్, మరియుకార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *