ఐశ్వర్య రాయ్ తొలి సంపాదన: రూ. 5 వేల నుంచే ప్రపంచ సుందరి ప్రయాణం

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రయాణం అత్యంత సాధారణంగా మొదలైంది. ఒకప్పుడు అగ్ర తారగా వెలిగిన ఆమె తొలి సంపాదన కేవలం రూ. 5 వేలు మాత్రమేనని బాలీవుడ్ నిర్మాత శైలేంద్ర సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 18 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి మెరైన్ డ్రైవ్‌లో తనను కలవడానికి వచ్చిన ఐశ్వర్య, అప్పట్లో మూడు ప్రకటనల కోసం ఆ మొత్తాన్ని తీసుకున్నట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

శైలేంద్ర సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐశ్వర్య తన కెరీర్ ఆరంభంలో ‘ముకేశ్ మిల్స్’లో చిత్రీకరించిన ఒక ప్రకటనలో ఎక్స్‌ట్రాగా నటించింది. ఆ తర్వాత ‘కలబంద (Ghrit Kumari) హెయిర్ ఆయిల్’ యాడ్‌లోనూ, మరో ప్రకటనలో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి నటించింది. అప్పట్లో ఆమె చూపించిన వినయం మరియు క్రమశిక్షణే ఆమె కెరీర్‌కు గట్టి పునాది వేశాయని ఆయన ప్రశంసించారు.

1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఐశ్వర్య కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆ తర్వాత 1997లో మణిరత్నం చిత్రం ‘ఇరువర్’ (తెలుగులో ఇద్దరు) తో సినీ అరంగేట్రం చేసి, బాలీవుడ్ మరియు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. నేడు వందల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, ఐశ్వర్య ఆరంభంలో చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *