కోరుట్ల మెట్ పెల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తేది:24- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్ములన సంస్థ, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణి కార్యక్రమం నిర్వహించి కోరుట్ల పట్టణ మహిళా సంఘాలకు 2,00,62,348 మెట్ పెల్లి పట్టణ మహిళా సంఘాలకు 1,22,02,227రూపాయల జంబో చెక్కులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ , జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి చెక్కు అందజేశారు
అలాగే కోరుట్ల మున్సిపల్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు సెంట్రల్ లైటింగ్ వంటి 18.70 కోట్ల అంచనా నిధులతో పనులకు
మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలో వాటర్ డ్రైన్స్, సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ఇంటర్నల్ సిసి రోడ్లు వంటి 18.70 కోట్ల నిధులకు అంచనా పనులకు శంకుస్థాపన చేశారు
ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ:
జగిత్యాల నియోజకవర్గ కోరుట్ల మరియు మెట్ పెల్లి మున్సిపల్స్ పరిధిలో మా మహిళా సోదరీమణులు, మా చెల్లెల్లు, మా అక్కలు, మా తల్లులు వడ్డీ రాయితీ కోరుట్ల పట్టణ మహిళా సంఘాలకు 2,00,62,348 మెట్ పెల్లి పట్టణ మహిళా సంఘాలకు 1,22,02,227రూపాయల జంబో చెక్కులను మా మహిళా సంఘ సోదరీమణులకు మేలు జరిగే కార్యక్రమం కోరుట్ల మున్సిపల్ కు సంబంధించిన సుమారు 18.70 కోట్ల మరియు మెట్ పెల్లి మున్సిపల్ కు సంబంధించిన సుమారు 18.70 కోట్ల విలువగల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
మహిళా సోదరీమణుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులను
ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను ఆర్థికంగా, వ్యాపార పరంగా మరియు అన్నిరకాలుగా ముందంజలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఈరోజు అమలు చేస్తున్న సందర్బంగా మొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకం ఉచిత బస్సు మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించిన ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య,వైద్యం మరియు మహిళాభివృద్ధికి ఇస్తుంది.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుంది.
ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ,సన్న బియ్యం , మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల ఉచిత కరెంట్ ,సోలార్ పవర్ ప్లాంట్ లు ,పెట్రోల్ బంక్ , మహిళలకు వడ్డీ లేని ఋణాలు,అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తుంది .
మహిళలకు కు నైపుణ్య శిక్షణ ,సమావేశ నిర్వహణ కోసం, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభం కాబోతున్నదని అన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ:
మహిళలు అన్నిరంగాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది వ్యాపారాలు ప్రారంభించాలని వాటిద్వారా ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.
మహిళలు రుణాలు తీసుకొని వివిధ రకాల వ్యాపారాలు చేసి మీరు ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబం ఆర్థికంగా ఎదిగే విధంగా మీ పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా మహిళలు ముందుండాలని కోరారు.కోరుట్ల, మెట్ పెల్లి మున్సిపల్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు
ఈ శంకుస్థాపన చేసిన పనులు కాంట్రాక్టర్లు నాణ్యతతో పూర్తిచేయాలని కోరారు. కోరుట్ల నియోజకవర్గం లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంక్షేమ శాఖ మంత్రి పూర్తి సహకారాలు అందించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
కోరుట్ల పట్టణ మహిళా సంఘాలకు 2,00,62,348 మెట్ పెల్లి పట్టణ మహిళా సంఘాలకు 1,22,02,227రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేయడం జరిగిందని తెలిపారు.
కోరుట్ల, మెట్ పెల్లి మున్సిపల్స్ కు పలు అభివృద్ధి పనులకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు కూడా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అందువలన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇదే ఉత్సాహంతో మహిళా సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వృద్ధి చేందాలని కోరారు.
మున్సిపల్ అభివృద్ధి కి నిధులు మంజూరు చేసినందుకు వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
వడ్డీ లేని రుణాలు అందించినందుకు మహిళలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధి కి తోడ్పడుతున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవో లు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్ మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో, మహిళా సంఘం సభ్యులు, వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *