సారంగాపూర్ మండలంలో పార్టీ గద్దెలను కూల్చడానికి కొంతమంది ప్రయత్నం – ఇరు వర్గాల వారిని పిలిపించి విచారించిన ఎస్ఐ గీత.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజిరెడ్డి.

జగిత్యాల జిల్లా : సారంగాపురం పరిధిలో గల పెంబట్ల దుబ్బ రాజేశ్వర టెంపుల్ పక్కన ఉన్న బస్టాండ్ ఎదురుగా ఉన్న టిఆర్ఎస్ టిడిపి గద్దెలను కూల్చడానికి కొంతమంది ప్రయత్నించారు. వారిని కోనాపూర్ గ్రామానికి చెందిన యువకులు మరియు సర్పంచ్ అడ్డుకొని యువకులు ఎదిరించారు దీనికి కోనాపూర్ ఉపసర్పంచి తిరుపాల కృష్ణయ్య వార్డ్ మెంబర్ భీమయ్య మరియు కుల సంఘ సభ్యులు సర్పంచ్ 100 నెంబర్ కు ఫోన్ చేసి తెలుపగా ఎస్ఐ గీత వచ్చి రెండు వర్గాల వారిని పిలిపించి విచారించారని తెలిపారు. ఎస్ఐ గీతా విచారణ జరిపి రెండు వర్గాల వారికి శివరాత్రి లోపల ఏ గొడవలు చేయవద్దని సరిహద్దు పరిష్కారం గురించి ఎమ్మార్వో కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు.
సమస్యను పరిష్కారం దిశలో ఎమ్మార్వో స్పందించినారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్ ఉపసర్పంచ్ కిష్టయ్య వార్డ్ మెంబర్ మసత్తి శ్రీకాంత్ భీమయ్య కమిటీ సభ్యులైనటువంటి తిరుమల అరవింద్ కమిటీ సభ్యులు ఏనుగుల మల్లేశం తోడేటి గంగాధర్, జైనాపురం రాకేష్ ,తిరుకోవేల చంద్రం తిరుకోవాలి నరసయ్య కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *