ప్రతిఒక్కరికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది – కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు, ఒక్కో జంటకు రూ.2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందజేసిన మంత్రి అడ్లూరి.

తేది:16- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో గౌరవ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు దివ్యాంగుల మరియు ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మాత్యులు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి విచ్చేసి కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు, ఒక్కో జంటకు రూ.2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను మొత్తంగా 37,50,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందజేయడం జరిగినది. దీంతోపాటు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పసుపు కుంకుమ తో చీరను కానుకగా అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ:
కులాంతర వివాహం చేసుకుని సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్న జంటలకు అభినందనలు తెలియజేస్తూ అన్యోన్యంగా జీవించాలని తెలిపారు. మీరందరూ ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.త్వరలో మిగిలిన జంటలకు కూడా బాండ్లను అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ప్రజా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ సెంటర్లు మరియు దివ్యాంగుల కోసం దివ్యాంగుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించిన ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బి. నరేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజకుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *