Arrive Alive కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్.

తేది:13- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ:
మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు.
“Arrive Alive” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ ,ఇన్స్పెక్టర్లు సుధాకర్, కరుణాకర్, కిరణ్ కుమార్, వేణు, సైదులు మరియు ఎస్.ఐ లు పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *