తేది:12-01-2026 TSLAWNEWS తెలంగాణ ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
సిరిసిల్ల జిల్లా: ఈరోజు సిరిసిల్ల జిల్లా పట్టణంలో ” గోపా ” తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి గొప్ప జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ” గోపా ” తరఫున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ , ఉపాధ్యక్షులు ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, కళ్యాణ్ చక్రవర్తి గౌడ్, జాయింట్ సెక్రటరీ , వనం శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అమరగాని నర్సయ్య గౌడ్, లు, జిల్లాకు చెందిన గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్దన్ గౌడ్, గౌడ హాస్టల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులి లక్ష్మీపతి గౌడ్ జెడ్పిటిసిలు మల్లు గారి నర్సాగౌడ్ మెరుగు యాదగిరి గౌడ్ మెరుగు యాదగిరి గౌడ్ మాజీ ఎంపీపీలు రంగు వెంకటేష్ గౌడ్ బైరగొని రమేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొనడం జరిగినది.