తేది:01-01-2026 భూపాలపల్లి జిల్లాTSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ప్రసిద్దిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం గాంధీనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్, సుజాత దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. గణపతి నందీశ్వ రుడు గణపేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సర్పంచ్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.