


తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.
సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ప్రతీ ఏటా డిసెంబర్ 31 న జగ్గారెడ్డి స్వగృహంలో ఆనవాయితీగా సత్యనారాయణ స్వామి కథ, అయ్యప్ప మహా పడి పూజ.
పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప స్వాములు, భక్తులు, నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణం లోని రామ్ నగర్ రామ్ మందిర్ వద్ద జగ్గారెడ్డి స్వగృహం లో సత్యనారాయణ కథ, అయ్యప్ప మహా పడి పూజ ఘనంగా జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతీ ఏటా డిసెంబర్ 31 న ఆనవాయితీగా ఈ పూజలను జగ్గారెడ్డి నిర్వహిస్తుంటారు. ప్రతీఏడు మాదిరిగానే ఈ సారి సైతం ఈ పూజలు కన్నుల పండుగ గా జరిగాయి. ఉదయం 10 గంటలకు సత్యనారాయణ స్వామి కథ తో ప్రారంభమయ్యే ఈ పూజ కార్యక్రమాల్లో మధ్యాహ్నము అయ్యప్ప పూజ, సాయంత్రం మొదలుకుని అర్ధరాత్రి వరకు మహా పడి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ప్రత్యేకంగా మధ్యాహ్నము యోగిని పుష్పార్చన, రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ భజన బృందాల చే ఏర్పాటు చేసిన భజనలు భక్తులను అలరించాయి.