రైతులు నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి,గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్.

తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం గాంధీనగర్ గ్రామ నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాంధీనగర్ గ్రామంలో గొర్రెలు మేకల మందలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గొర్రెలు మేకలకు ప్రతి సంవత్స రం మూడుసార్లు నట్టల నివారణ మందు త్రాగించాలని సూచించారు. పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నట్టల నివారణ మందుల వల్ల గొర్రెలు మేకలలో నట్టలను సమూలంగా నిర్మూలన జరుగుతుందని అదేవిధంగా జీవాల లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి మరణాల శాతం తగ్గుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధం మమత- సుధాకర్, గొల్ల కురుమ పెద్దమనిషి పెంట చిరంజీవి, బొచ్చు అభిషేక్, బినివేన సమ్మయ్య, మాదం పోషాలు, బినవేన రాజు,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శ్రీనివాస్,జంగా నగేష్, ఇంజపల్లి ప్రవీణ్, కుర్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *