తేది:17-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో 3వ దశ పోలింగ్లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, త్వరితగతిన పూర్తి అయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆర్ ఓ అధికారులకు ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, నోడల్ ఆఫీసర్లు రఘువరన్, నరేష్, మదన్మోహన్, రేవంత్, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, సంబంధిత ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.