


తేది:17-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు.