వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం లేదు. అయితే, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో జగన్ 2013 సెప్టెంబరు నుంచి బెయిల్పై ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు ఆదేశం మేరకు ఆయన ఒక రోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.