రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు: ‘ఆర్మీ కూడా 10 శాతం అగ్రవర్ణాల ఆధీనంలో ఉంది’

బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దేశంలో కేవలం 10 శాతం అగ్రవర్ణాలకే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, జ్యుడీషియరీతో పాటు, ఆర్మీ కూడా వారి ఆధీనంలో ఉందని చెప్పడంలో తప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, మిగతా 90 శాతం భారత జనాభాను కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ కీలక రంగాల్లో తగిన స్థానం లేదని రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో సమాన హక్కుల కోసం, అధికార వనరుల సమతుల్య పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని మరియు దేశ సంస్థలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ వ్యాఖ్యల ఉద్దేశం సామాజిక న్యాయానికి సంబంధించినదని, సైన్యంలోనూ వివిధ వర్గాల ప్రాతినిధ్యం పెరగాలని మాత్రమే ఆయన కోరారని వివరణ ఇచ్చారు. రాహుల్ గతంలో చేసిన చైనా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడిన కొద్ది కాలంలోనే, బిహార్ ప్రచారంలో చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన మళ్లీ విమర్శల వలయంలో చిక్కుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *