తిరుమల:మళ్లీ చిరుత కలకలం…..భక్తులకు భద్రతా హెచ్చరికలు!…

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రం మరియు వినాయక స్వామి ఆలయం మధ్య ఉన్న కుసుమ రహదారిలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘాట్ రోడ్డులో అటుగా ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను చూసి తీవ్ర భయానికి గురయ్యారు.

చిరుత సంచారం గురించి సమాచారం అందిన వెంటనే టీటీడీ విజిలెన్స్ మరియు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో కూడా నడక మార్గాలు, ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం కారణంగా టీటీడీ ఇప్పటికే భక్తుల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ వస్తోంది.

అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షిస్తూ, అడవి జంతువుల సంచారంపై నిఘా ఉంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *